అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా అనేక సంచలనాలు సృష్టిస్తుంది. ఇటీవల సినిమాకి సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ తో హీరో అల్లు అర్జున్ ఎంతగానో ఆకట్టుకున్నాడు ప్రేక్షకులను. అంతేకాకుండా అల్లు అర్జున్ ఫస్ట్ ఇంపాక్ట్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించింది. దీంతో ఈ సినిమాను టాలీవుడ్ తో పాటు మలయాళం లో కూడా రిలీజ్ చేయాలని అనుకొన్నారు.
ఎందుకంటే మలయాళంలో హీరో అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో మలయాళంలో కూడా విడుదలచేస్తున్నారు భారీ ఎత్తులో. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులు ఫస్ట్ ఇంపాక్ట్ రిలీజ్ కాకముందే రూ.12 కోట్లకు అమ్ముడుపోయాయి. అయితే రిలీజ్ తరువాత అమ్మి ఉంటే నా పేరు సూర్యా నిర్మాతకు ఇంకా ఎక్కువగా లాభం వచ్చి ఉండేది. ఎందుకంటే ఇటీవల ఒక బడా కంపెనీ వచ్చి రూ.18 కోట్లను అఫర్ చేసిందట.దీంతో అనుకోకుండా ఇతర కంపెనీతో డీల్ సెట్ అవ్వడంతో సినిమాకు రూ.6కోట్లు ఆ విధంగా మిస్ అయ్యాయి.