అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథను అందిస్తుండడం విశేషం. ప్రసతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో బిజీగా ఉన్న అఖిల్ ఆ సినిమా పూర్తికాగానే సురేందర్ రెడ్డి చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన అందాల తార రష్మిక మందన నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరూ సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిన రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అఖిల్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరనుందని చర్చలు జరుగుతున్నాయి.