రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన రాంబంటు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి ఐశ్వర్య రాజేశ్. పేరుకు తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా అనంతరం పలు వరుస చిత్రాల్లో నటించిందీ బ్యూటీ. సుమారు 8 ఏళ్ల పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ చిన్నది.. 2018లో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటోంది.
ఇదిలా ఉంటే సినిమాలతో బిజీగా ఉండే ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో నిత్యం టచ్లో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఐశ్వర్య ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఐశ్వర్య ప్రమఖ మ్యాగజైన్ జేఎఫ్ డబ్ల్యూ కవర్పై తళక్కుమంది. బంగారు వర్ణ చీర కట్టులో కనిపించి ఆకట్టుకుంది. ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఐశ్వర్య.. ‘జేఎఫ్ డబ్ల్యూ కవర్ ఫొటోపై స్థానం సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వూను ఓసారి చూడండి’ అంటూ క్యాప్షన్ను జోడించిందీ బ్యూటీ.