‘ప్రజాపతి’ అనే మలయాళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల నటి అదితీ రావు. అనంతరం పలు హిందీ, తమిళ చిత్రాల్లో నటించిన ఈ చిన్నది ‘సమ్మోహనం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో తన క్యూట్ నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసిందీ బ్యూటీ. ఇక తాజాగా నాని హీరోగా వచ్చిన ‘వి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో అదితీ పాత్ర తక్కువ నిడివి ఉన్నదే అయినప్పటికీ.. తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.
ఇక లాక్ డౌన్ తన జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చిందని చెప్పుకొచ్చిందీ బబ్లీ గర్ల్. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కారోనా తన జీవితంలో తీసుకొచ్చిన మార్పు గురించి మాట్లాడుతూ… ‘ ఈ మధ్యనే జాన్ అబ్రహంతో కలిసి ముంబైలో ఓ షూటింగ్ లో పాల్గొన్నా… అక్కడ ఏసీ ఫ్లోర్ లో చలికి వణికి పోయా. డ్రెస్ తో పాటు పీపీఈ కిట్లు ధరించినవారు.. ఎంతగా ఉక్కిపోయరోనని ఆలోచిస్తూ కూర్చుండిపోయా. కానీ ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. ఓపిక, పాజిటివ్ గా ఎలా ఉండాలో లాక్ డౌన్ నేర్పింది. దయగా ఎలా మెలగాలి, ఏ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి లాంటి అంశాలను బాగా నేర్చుకున్నాను’ అంటూ చెప్పికొచ్చిందీ చిన్నది.