అలనాటి మేటి హీరోయిన్ కన్నుమూత

సిని నటి అందాల నటి అలనాటి హీరోయిన్ కృష్ణకుమారి(85) తుదిశ్వాస విడిచారు. కృష్ణకుమారి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది బెంగళూరులో కన్నుమూశారు. అగ్రనటిగా ఈమె ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి తెలుగు అగ్రహీరోలతో ఈమె నటించడం జరిగింది.అంతేకాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేయడం జరిగింది.

‘నవ్వితే నవరత్నాలు’ సినిమాతో ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.భార్యాభర్తలు, కులగోత్రాలు, గుడిగంటలు, వాగ్దానం, పిచ్చిపుల్లయ్య, బంగారుపాప….వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. కృష్ణకుమారి మరణం తో సినీరంగం ఒక్కసారిగా షాక్ కు గురైంది. సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

పశ్చిమ బెంగాల్ లోని నైహతిలో 1933 మార్చి 6న కృష్ణకుమారి జన్మించారు. నటి షావుకారు జానకి ఈమె అక్క. సుమారు 110కి పైగా తెలుగు సినిమాల్లో కృష్ణకుమారి నటించారు. బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ ను పెళ్లాడిన ఆమె అక్కడే ఉండిపోయారు. కృష్ణకుమారి దంపతులకు దీపిక అనే కుమార్తె ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here