ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ వెహికల్కు ఆవు అడ్డు రావడంతో సడెన్ గా బ్రేకులు వేశారు. దీంతో ఎస్కార్ట్ వాహనాలు ఒక్కొక్కటి ఢీకొన్నాయి.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్ వాహనం బ్రేక్ వేయడంతో వెనకాల ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అయితే చంద్రబాబుకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఎన్.ఎస్.జి వాహనం మొరాయించడంతో ఆయన కొద్ది సేపు అక్కడే ఆగిపోయారు. ఆ తర్వాత బయలుదేరారు.
చంద్రబాబు వాహనానికి ప్రమాదం జరిగిందన్న వార్త తెలియగానే రాష్ట్రం మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.