బాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్ వుడ్ అనే తేడాలు లేకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ అంశం.. షేక్ చేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బడా హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్న క్రమంలో తాజాగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నలుగురు హీరోయిన్లు నోటీసులు జారీ చేయడంతో ఈ విషయం మరింత సెన్సేషన్ గా మారింది.
తాజాగా బాలీవుడ్ స్టార్స్ దిపికా పదుకొనే, శ్రద్ధ కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ లకు… నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నోటీసులు జారీ చేసింది, మూడు రోజుల్లో తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించగా బాలీవుడ్లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత పేరు కూడా ఈ వివాదంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మరి ఈ డ్రగ్స్ అంశం ఎక్కడికి పోతుందో చూడాలి.