అంత్య‌క్రియ‌లు చేస్తుండ‌గా క‌దిలిన యువ‌తి..

అనారోగ్యంతో బాద‌పడుతూ చ‌నిపోయిన యువ‌తికి అంత్య‌క్రియ‌లు చేస్తుండ‌గా ఉన్న‌ట్టుండి ఆమె క‌దిలింది. దీంతో ఆ యువ‌తిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే డాక్ట‌ర్లు ఆమె చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించారు. దీంతో నిరాశ‌తో ఆ యువ‌తి కుటుంబ స‌భ్యులు, బంధువులు స్మ‌శానికి వెళ్లిపోయారు.

ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని భూపాల‌ప‌ల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మ‌హ‌దేవ‌పూర్ మండ‌లంలోని కుదురుప‌ల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల గీతాంజ‌లి కొద్ది రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతోంది. బుధవారం ఆ యువ‌తి చ‌నిపోయింది. దీంతో మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేసేందుకు స్మ‌శానికి తీసుకెళ్లారు. అయితే ఈ క్ర‌మంలో ఉన్న‌ట్టుండి ఆమె క‌దిలిన‌ట్లు ప‌లువురు కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు.

వెంట‌నే అక్క‌డి నుంచి ఆమెను హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. హాస్పిట‌ల్‌కు వెళ్లిన వెంట‌నే ఆమెకు ఈసీజీ తీశారు. అయితే ఆమె చ‌నిపోయింద‌ని చెప్పారు. ఈమె చ‌నిపోయి చాలా సేపు అయ్యింద‌ని క్లారిటీ ఇచ్చారు. కాగా ఆమె క‌దిలిన‌ట్లు అనిపించినందుకే హాస్పిట‌ల్‌కు తీసుకొచ్చామ‌ని డాక్ట‌ర్‌కు తెలిపారు. అయితే ఈమె కదిలే అవ‌కాశ‌మే లేద‌ని వైద్యులు వెల్ల‌డించారు. దీంతో చేసేదేమీ లేక మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు తిరిగి శ్మశానికి తరించారు. ఈ సంఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కుదురుపల్లిలో చోటుచేసుకుంది. విష‌యం తెలుసుకున్న వారంతా ఆ యువ‌తి మ‌ళ్లీ తిరిగి వస్తుంద‌న్న ఆశ‌ను వ్య‌క్తం చేశారు. తీరా చివ‌ర‌కు నిరాశ‌కు గుర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here