ల‌వ్ జీహాదీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌..

ఇండియాలో ల‌వ్ జీహాదీ ఈ మ‌ద్య బాగా చ‌ర్చ‌లోకి వ‌స్తోంది. దేశ రాజ‌కీయాల్లో ఇది తీవ్ర దుమారం సృష్టిస్తోంది. రాజ‌కీయ నాయ‌కుల నుంచి సామాన్యుల దాకా ల‌వ్ జీహాదీ అంశం గురించే డిస్క‌ష‌న్. కాగా దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ వ్యంగాస్త్రాలు సంధిస్తోంది.

బీజేపీ అగ్రనేతలైన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, షానవాజ్ హుస్సేన్ విషయంపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఓ ముస్లిం యువకుడు హిందూ అమ్మాయిని వివాహం చేసుకుంటే అది లవ్ జిహాద్. మోదీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. బీజేపీ అగ్రనేత షానవాజ్ హుస్సేన్ కూడా హిందూ మహిళను వివాహం చేసుకున్నారు. ఇది కూడా లవ్ జిహాదేనా అంటూ దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ఎలాంటి అజెండా లేదని, చర్చించడానికి ఎలాంటి అంశాలు లేవని అందుకే హిందూ, ముస్లిం వ్యవహారాన్ని తెరపైకి తెస్తారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

హిందూ, ముస్లిం పేరుతో బీజేపీ నేతలు సమాజంలో విద్వేషాన్ని నింపుతున్నారని కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. కాగా బీజేపీ ప‌ట్ల ముస్లీంలు వ్య‌తిరేకంగా ఉంటార‌న్న మాట‌లు స‌ర్వ‌సాదార‌ణంగానే వినిపిస్తుంటాయి. బీజేపీ హిందూవుల‌కు సంబందించిన పార్టీ అని.. ముస్లీంలను వేరుగా చూస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు అవ‌స‌రం అయిన‌ప్పుడ‌ల్లా బీజేపీపై మండిప‌డుతుంటాయి. ఇప్పుడు ల‌వ్ జీహాదీ విష‌యంలో కూడా కాంగ్రెస్ ఈ త‌ర‌హాల వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మ‌రి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో అన్న‌ది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here