జూబ్లీ హిల్స్ లో మెట్రో పిల్లర్ ని గుద్ది యాక్సిడెంట్ కి గురైన ఏపీ మునిసిపల్ మినిస్టర్ నారాయణ కొడుకు నితీష్ యాక్సిడెంట్ వీడియో కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. నిషిధ్ కారు ప్రమాదానికి గురవుతున్న టైం లో అక్కడ ఉండి అనుకోకుండా ఆ ప్రమాదాన్ని మొబైల్ లో బంధించాడు అతను. ఆ తరవాత ప్రమాదం అప్పటి లైవ్ వీడియో తన దగ్గర ఉంది అనీ దాన్ని తాను అమ్మాలనుకుంటున్నానని… మీరు కొంటారా అంటూ ఓ ప్రముఖ తెలుగు మీడియా సంస్థకు ఆయన మెయిల్ చేశాడు.
ఆ మెయిల్ లోనే వీడియో కి సంబంధించి చిన్న క్లిప్ , స్క్రీన్ షాట్ లు కూడా పెట్టాడు అతను . ఆ తరవాత మీడియా సంస్థ తో డిస్కషన్ లు జరుపుతున్న అతను సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. డబ్బు బేరం కుదరక ఇలా చేసాడా అంటున్నారు. టీవీ 9 సాక్షి ఎన్ టీవీ ఆఫీసులకి ఈ వీడియో ని ఇస్తా అంటూ బేరం పెట్టినట్టు తెలుస్తోంది.