టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో సెటైర్లు గుప్పించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారీ కూడా సొంతంగా గెలవలేదని అన్నారు.అయితే 2019 ఒంటరి పోరులో చంద్రబాబు గారి అసలు బలం ఏంటో తేలిపోయిందని, వేరేవారి భుజంపై తుపాకి పెట్టి కాల్చాలనే పాత ఫార్ములా వదలడని, ఎన్నికల ముందు మోదీ భార్య, తల్లిపైనా వ్యక్తిగత విమర్శలు చేశాడు ఇప్పుడేమో మనుషుల్ని పంపి కాళ్లబేరాలాడుతున్నా ఫలితం లేదని అన్నాడు