మ‌రో యువ‌తిపై సామూహిక అత్యాచారం.. వెల్లడించిన పోలీసులు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌థ్రాస్‌లో ఓ యువ‌తి ఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న జ‌రిగింది. గురుగ్రామ్‌లో ఓ యువ‌తిపై న‌లుగురు యువ‌కులు సామూహిక అత్యాచారం చేశారు. బాదితురాల పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

సికింద‌ర్ పూర్ రైల్వే స్టేష‌న్లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఓ యువ‌తిని రైలు రావ‌డం ఆల‌స్యం అవుతుంద‌ని చెప్పి ఓ యువ‌కుడు న‌మ్మించాడు. అక్క‌డ నుంచి ప‌క్క‌నే ఉన్న ఓ కాంప్లెక్సు వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌గా అత‌నికి తోడుగా మ‌రో ముగ్గురు యువ‌కులు అక్క‌డ‌కు వ‌చ్చారు. వీరంతా క‌లిసి ఆమెను అత్యాచారం చేశారు. ఆమె కేక‌లు వేయ‌డంతో అక్క‌డ నుంచి పారిపోయారు. అత్యాచారం చేసే స‌మ‌యంలో ఆమె త‌ల‌పై దాడి చేశారు. అక్క‌డ ప‌డిఉన్న ఆమెను చూసిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

బాదిత మ‌హిళ‌ను వెంట‌నే హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు చుట్టుప్ర‌క్క‌ల ఉన్న ఆదారాల మేర‌కు న‌లుగురు యువ‌కుల‌కు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌వారేన‌ని ఏసీపీ క‌ర‌ణ్ గోయ‌ల్ తెలిపారు. దేశం మొత్తం అత్యాచారాల‌పై ఆందోళ‌న‌లు చేస్తున్న వేళ ఇలాంటి మ‌రో ఘ‌ట‌న జ‌ర‌గడంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్యక్తం అవుతోంది. నిందితులును క‌ఠినంగా శిక్షించాల‌న్న డిమాండ్ వినిపిస్తోంది.  కాగా బాదిత మహిళ త‌ల‌పై కొట్ట‌డంతో తీవ్ర గాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో త‌ల‌ను గోడ‌కేసి కొట్టారు. సికింద‌ర్‌పూర్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here