2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్: లగడపాటి రాజగోపాల్

మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ ప్రతిపక్ష నేత జగన్ మీద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అని చెప్పారు. ప్రస్తుతం జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రతో రాష్ట్రంలో వైసీపీ పార్టీ బలంగా బలపడిందని అన్నారు లగడపాటి. సినిమా రంగంలో ఉండే స్టార్ హీరోల  కన్నా జగన్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉందని అన్నారు.

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే ప‌టిమ‌గ‌ల నాయ‌కుడ‌న్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో వైఎస్ జ‌గ‌న్ త‌న శ‌క్తిని మ‌రింత పెంచుకుంటున్నార‌ని, నాడు ఎన్టీయార్‌, వైఎస్ఆర్‌లు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయేలా పాలన అందించార‌ని, ఇప్పుడు అలాంటి పాల‌న‌నే వైఎస్ జ‌గ‌న్ అందించ‌గ‌ల‌డ‌ని స్ప‌ష్టం చేశారు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌. ఈ వ్యాఖ్యలు విన్న రాజకీయ విశ్లేషకులు త్వరలో లగడపాటి రాజగోపాల్ వైయస్ఆర్ సీపీలో చేరుతారని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here