బిస్కెట్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి..

బిస్కెట్లు తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌ర్నూలు జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. జిల్లాలోని ఆళ్ళ‌గ‌డ్డ మండ‌లం చింత‌కొమ్మ‌దిన్నె గ్రామంలోని చిన్నారులు ముగ్గురు ఆదివారం బిస్కెట్లు తిన్నారు. వెంట‌నే అస్వ‌స్థ‌త‌కు గుర‌వ్వ‌డంతో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

హుసేన్‌భాష (6), హుసేన్ బి (4), జ‌మాల్ బీ (8)లు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఆదివారం రోజు ఊరిలోని కిరాణం షాపులోకి వెళ్లి బిస్కెట్లు తెచ్చుకొని టీతో క‌లిపి తిన్నారు. వెంట‌నే ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు. దీంతో ఆందోళ‌న‌కు గురైన కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆళ్ళ‌గ‌డ్డ‌లోని ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే హుసేన్‌భాషా చ‌నిపోయారు. మెరుగైన చికిత్స కోసం హుసేన్‌బీ, జ‌మాల్‌బీల‌ను క‌ర్నూలుకు త‌ర‌లించారు.

అయితే సోమ‌వారం రోజు చికిత్స పొందుతూ హుసేన్‌బీ చ‌నిపోయింది. బుధ‌వారం రోజు జ‌మాల్ బీ మృతిచెందింది. దీంతో ఆ ప్రాంతంలో విషాధ ఛాయ‌లు అల‌ముకున్నాయి. బిస్కెట్లు తిని ఎలా చ‌నిపోయార‌న్న దానిపై సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. నిజంగా బిస్కెట్ల వ‌ల్ల‌నే ఇలా జ‌రిగిందా లేదా విష ప్ర‌యోగం ఏమైనా జ‌రిగిందా అన్న అనుమానాలు బ‌య‌టికొచ్చాయి. అయితే అధికారులు వెంట‌నే బిస్కెట్లు తెచ్చుకున్న దుకాణాన్ని సీజ్ చేశారు. బిస్కెట్లు ఎక్క‌డ నుంచి తీసుకొచ్చారన్న దానిపై విచార‌ణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here