చదువుకునే వయస్సుల్లో చేసే పొరపాట్లు ఎంతవరకు దారితీస్తాయో తెలియదు. ఓ పద్నాలుగేళ్ల బాలిక గర్బం దాల్చడమే కాకుండా 9 నెలల తర్వాత ప్రసవించింది. అయితే విషయం బయటకు తెలియకుండా ప్రసవించిన శిశువును ఫ్రిజ్లో ఉంచింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం..
రాష్యా దేశంలో ఈ ఘటన వెలుగుచూసింది. సైబీరియా ప్రాంతంలోని నోవోసిఇబిర్క్స్ నగరంలోని వర్ద్ తులా గ్రామానికి చెందిన ఓ బాలిక చదువుకుంటోంది. అయితే 14 ఏళ్ల ఈ బాలిక గర్బం దాల్చింది. అయితే విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా అలాగే ఉండి పోయింది. చివరకు నెలలు నిండిన నేపథ్యంలో ప్రసవించింది. అయితే ఇప్పుడు విషయం బయటకు తెలిసిపోతుందని భయపడి తన తండ్రి తోటలోకి వెళ్లినపుడు మగ శిశువును గ్యారేజీ ఫ్రిజ్లో దాచి పెట్టింది.
తన గర్బం, ప్రసవించిన బిడ్డ గురించి ఎవ్వరికీ తెలియకుండా ఉండాలని ఇలా చేసింది. బాలిక ప్రసవించిన తర్వాత రక్తస్రావం చూసి ఆమె తల్లి తన కూతురు అపెండిసైటిస్ తో బాధపడుతుందని అంబులెన్సను ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించింది. తర్వాత ఆసుపత్రిలో చేరిన బాలిక తనకు జన్మించిన నవజాత శిశువు గురించి బయటకు చెప్పేసింది. అనంతరం ఇంటికి వెళ్లి చూడగా ఫ్రిజ్లో ఉంచిన ఆ శిశువు మరణించింది. ప్రస్తుతం ఆ బాలిక హాస్పిట్లోనే ఉంది. ఆ మె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. విషయం తెలిసిన వారంతా అవాక్కయ్యారు. ఇన్ని రోజులు తన గర్బం విషయం బయటకు రాకుండా ఎలా దాచిపెట్టిందని చర్చించుకుంటున్నారు.