పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన చివరి మూడు సినిమాలూ అంటే గోపాల గోపాల, సర్దార్ , కాటమరాయుడు ఈ మూడూ అతని మిత్రుడు శరత్ మరార్ ప్రొడ్యూస్ చేసాడు. సురేష్ ప్రొడక్షన్స్ వారితో పాటు గోపాల గోపాల చేసిన శరత్ మిగతా రెండూ సొంతగా చేసాడు. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి కూడా బయ్యర్ లకి సంతృప్తిని ఇవ్వలేదు. గోపాల గోపాల నష్టాల్లోంచి బయట పడేసింది కానీ సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం భారీ నష్టాలు మిగిల్చింది. కాటమరాయుడు చిత్రం కూడా ఇప్పుడు అదే కోవలోకి వెళ్ళేలా కనపడుతోంది. సర్దార్ దెబ్బకి కాటమరాయుడు బయ్యర్ లు భయపడినా సరే ఎక్కువ రేట్ కే తన సినిమాని అమ్ముకున్నాడు మరార్ .
ఒక సినిమా ప్లాప్ అయితే ప్రొడ్యూసర్ కి దెబ్బ పడుతుంది, పవన్ కళ్యాణ్ – మహేష్ – ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోల సినిమాలు అయితే ఇంకా ఇంకా ఇబ్బందే కానీ మరార్ పవన్ లకి ఆ ఇబ్బంది ఎక్కడా లేదు అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. సినిమా ప్రభావం వీరి విషయం లో తక్కువ బడ్జెట్ వలన సేవ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి బయ్యర్ లకి మాత్రం ఎక్కువ కి అమ్మేసారు. సో పవన్ ఒక పాతిక కోట్లు , శరత్ ఒక పాతిక జేబులో వేసుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ లు మాత్రం నిండా మునుగుతున్నారు