నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు…చ‌ర్య‌ల‌కు లోక్ సభ స్పీకర్ ఓకే.

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీకి చెందిన వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు.ఈ రోజు  ఢిల్లీకి వెళ్ళిన వైసీపీ ఎంపీలు, ఎంపీల బృందంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత – ఎంపీ విజయసాయిరెడ్డి – లోక్ సభ పక్షనేత మిథున్ రెడ్డి – ఎంపీలు నందిగం సురేష్ – లావు శ్రీకృష్ణదేవరాయలు – మార్గాని భరత్ ఉన్నారు. ఇక రఘురామకృష్ణంరాజుకు ఇప్పటికే పార్టీ నుంచి షోకాజు నోటీసు అందిన విషయం తెలిసిందే.

రఘురామకృష్ణంరాజు మీద స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అనర్హత వేటు వేయాలని కోరారు. లోక్ సభ స్పీకర్ తో దాదాపు 20 నిమిషాల పాటు వారు చ‌ర్చించారు.. అనంతరం వైసీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి దీని గురించి మాట్లాడుతూ.. వైసీపీ తరఫున ఎన్నికైన రఘురామకృష్ణంరాజు ముఖ్య‌మంత్రి జగన్‌ మీద అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని అన్నారు.

వైసీపీలో ఉంటూ మిగిలిన ప్రతిపక్షాలతో మంతనాలు చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఆయనపై ఫిర్యాదు చేశామన్నారు. రఘురామకృష్ణంరాజు నైతిక విలువలు కోల్పోయారు. ప్రతిపక్షాలతో లాలూచీ పడ్డారు. ఆయన దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం. కొన్ని ఊహాజనిత విషయాలను ఊహించుకుంటున్నారు. ఏదైనా ఒక విషయం మీద క్లారిటీ రావాలంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలి. బయటకు రాకూడదు. ఏదైనా అసంతృప్తి, విషయం ఉంటే పార్టీ అధ్యక్షుడికి చెప్పాలి. అంతేకాని రోడ్డుక్కకూడదు. ఒక ఉద్దేశంతో ఆయన ఇదంతా చేశారు.’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని గత నెల 22వ తేదీన ఎంపీ విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ షోకాజ్ నోటీసుపై రఘురామకృష్ణంరాజు సాంకేతిక అంశాలను ప్రస్తావించారు. ఆ తరువాత గత నెల 29వ తేదీన ఏపీ సీఎం జగన్ కు రఘురామకృష్ణంరాజు ఆరు పేజీల లేఖను రాశాడు. షోకాజ్ కు సమాధానం ఇవ్వకుండా ఇష్టానుసారంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారని వైసీపీ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇవాళ స్పీకర్ కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. వంద పేజీలతో స్పీకర్ కు రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫిర్యాదు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here