కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోం శాఖ మంత్రి

తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో చికిత్స పొందడం కోసం ఆయన అపోలో హాస్పిటల్‌లో చేరారు. డిప్యూటీ సీఎంతోపాటు ఆయన కుమారుడు, మనవడు కూడా హాస్పిటల్‌లో చేరారు. కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు ఆయణ్ని హాస్పిటల్‌లో చేర్పించారు. తాజా పరీక్షల్లో అలీతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు నెగటివ్ అని రిపోర్ట్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో అలీ డాక్టర్ల సూచన మేరకు ఉదయం యోగ చేసి, పౌష్టిక ఆహారం తీసుకున్నారు. దీంతో తిరిగి పూర్తి ఆరోగ్యవంతంగా తయారయ్యారు. హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన అలీ.. తను కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, ఆయన సతీమణి కూడా ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. 71 ఏళ్ల వయసులోనూ ఆయన ఆత్మస్థైర్యంతో కోవిడ్‌ను జయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here