డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా విడుదలవడానికి సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రియ రిలీజ్ వేడుక హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. ప్రస్తుతం ఈ వేడుక గురించి సినిమా యూనిట్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ .. చరణ్ లను ముఖ్య అతిథులుగా మహేశ్ బాబు ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ మాత్రమే ఈ వేడుకకి హాజరవుతున్నాడట .. చరణ్ రావడంలేదని టాక్. ఏదో ముఖ్యమైన పని కారణంగా చరణ్ రాలేకపోతున్నాడని అంటున్నారు.
మెగా .. నందమూరి .. ఘట్టమనేని వారసులను ఒకే వేదికపై చూడాలనుకున్న అభిమానులకు ఈ వార్త కాస్త నిరాశను కలిగించేదే. ఈ సినిమాకి మొదటి నుంచి వున్న హైప్ కారణంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారని సమాచారం. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. గతంలో కొరటాల మహేష్ కలయికలో వచ్చిన శ్రీమంతుడు బాక్సాఫీస్ దగ్గర భీభత్సంగా కలెక్షన్ల రికార్డులు సృష్టించడంతో….ఈ సినిమాపై మహేష్ అభిమానులకు ఓ రేంజ్ లో ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొట్టాలని ఉంటున్నాడు మహేష్.