‘ప్రయివేట్’లో ఉచితంగా కరోనా టెస్టులు, చికిత్స..టీస్ సర్కార్ కీలక నిర్ణయం

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రయివేట్ హాస్పిటళ్లలోనూ కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుందని సమచారం. ప్రయివేట్ మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనా టెస్టులు, చికిత్స అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా మూడు ప్రయివేట్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేశారని సమాచారం.

మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మమతా మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్సను ఉచితంగా అందించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలు తెలియాల్సి ఉంది. ఈ మూడు కాలేజీల్లో కరోనా చికిత్స విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని తేలితే… మిగతా మెడికల్ కాలేజీల్లోనూ ఈ విధానాన్ని అవలంభించే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఎంపిక చేసిన మెడికల్ కాలేజీల్లో మల్లారెడ్డి, మమతా మెడికల్ కాలేజీలు మంత్రులకు చెందినవి కావడం గమనార్హం. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ మంత్రి మల్లారెడ్డిది కాగా.. మమతా మెడికల్ కాలేజీ పువ్వాడ అజయ్‌ కుమార్ కుటుంబానికి చెందినది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here