ఓటీటీలో మెగా హీరో సినిమా.?

లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూత పడడంతో దర్శకనిర్మాతలందరూ ఓటీటీ బాటపడుతున్నారు. నానిలాంటి బడా హీరో అమేజాన్‌ ప్రైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రావడంతో అందరిలోనూ నమ్మకం పెరిగింది. అందులోనూ ఓటీటీ సంస్థలు కూడా భారీ మొత్తాన్ని చెల్లించి సినిమా హక్కులను కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పుడీ బాటలోనే మరో యంగ్‌ హీరో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ బడా ఓటీటీ సంస్థ చిత్ర యూనిట్‌తో భారీ ఒప్పందాన్ని చేసుకుందని సమాచారం. ‘పే ఫర్‌ వ్యూ’ పద్ధతిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా ఈ సినిమా డిజిటల్‌ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అన్‌లాక్‌ 5.0 నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ప్రేక్షకులతో థియేటర్లకు అనుమతిస్తోన్న క్రమంలో చిత్ర యూనిట్‌ ఈ నిర్ణయాన్ని పునసమీక్షించుకుంటాదా.? లేదా ఓటీటీలో విడుదల చేస్తుందా? చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here