త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, పూజాల జోడికి మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ ఈ జంట వెండితెరపై సందడి చేయనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకోవాలని త్రివిక్రమ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అరవింద సమేతలో ఈ జోడి బాగా వర్కవుట్ కావడంతో తివ్రిక్రమ్ మళ్లీ ఈ మ్యాజిక్ను రిపీట్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాను రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ‘అరవింద సమేత’ యూనిట్ మొత్తం రిపీట్ కానుందన్నమాట. యాక్షన్, రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు.