ధృవ-2 రానుందా.? వస్తే చెర్రీ మళ్లీ నటిస్తారా.?

తమిళంలో తెరకెక్కిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా ధృవ పేరుతో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా చెర్రీ కెరీర్ లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ మంచి నటనను కనబరిచారు. ఇక తాజా సమాచారం ప్రకార తమిళంలో ‘తని ఒరువన్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో ఈ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేస్తారా.? అన్న వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ధృవ మంచి విజయం సాధించడంతో.. ధృవ 2ను కూడా కచ్చితంగా తెరకెక్కిస్తారని ఓ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటిస్తారా.? మరే హీరో అయినా… నటిస్తున్నారా తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here