నేను దళితుడిగా పుట్టినందుకు తెలుగుదేశం పార్టీ నన్ను అవమానపరిచింది: వర్ల రామయ్య

ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ సస్పెన్స్ కు తెరదించింది. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది tdp. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒ.సి వర్గానికి చెందిన సీఎం రమేష్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌లను ఖరారు చేశారు. దీంతో మరోసారి తనకు చంద్రబాబు మొండిచేయి చూపారని వర్ల రామయ్య ఆవేదన చెందుతున్నారు. నేను దళితుడిగా పుట్టినందుకు చంద్రబాబు నాయుడు నన్ను అవమానించారు.
చంద్రబాబు తీరుతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబును కలిసేందుకు కుటుంబంతో సహా బయలుదేరిన వర్ల రామయ్య కృష్ణా బ్యారేజీ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. తాను దళితుడిని అయినందునే తీవ్రంగా మరోసారి చంద్రబాబు అవమానించారని వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు వర్ల రామయ్య, సీఎం రమేష్‌ అని విస్తృత ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రేపటితో రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ గడువు ముగియనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here