అమితాబ్, అభిషేక్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్

రోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. వీరిద్దరూ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం, వారికి పెద్దగా కరోనా చికిత్స అందించాల్సిన అవసరం లేదని నానావతి ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు.

అమితాబ్ కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ కరోనా లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అమితాబ్ కుటుంబం కరోనా నుంచి కోలుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here