ఆంధ్రా అధికారివి నువ్వెంతరా అంటూ తెలంగాణా ఎమ్మెల్యే రచ్చ

గతంలో ఓ కాలేజీ యజమానిని చంపుతానని హెచ్చరించి, దాని ఆడియో బయటకు రావడంతో మార్ఫింగ్ చేశారని ఎదురు ఆరోపణలు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వేముల వీరేశం మరో వివాదంలో చిక్కాడు. ఆయనకు చెందిన ఆడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వీరేశం, నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓను బండబూతులు తిడుతున్నారు.
బ్యాంకు డీజీఎం లక్షమ్మ నిధుల దుర్వినియోగం కేసులో సస్పెండ్ కావడంతో, ఆమెకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని సీఈఓ మదన్ మోహన్ కు వీరేశం ఫోన్ చేశాడు. ఈ విషయం తన పరిధిలోది కాదని ఆయన చెబుతుంటే, “నా మాటకే ఎదురు చెప్తావా… ఆంధ్రా అధికారివి” అంటూ నోరు జారడంతో పాటు రాయడానికి వీల్లేని బూతులు తిట్టాడు. అడిగిన పని చేయకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా, వీరేశం వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here