కోహ్లి అనుష్క కోసం ఇటలీ కి షారూఖ్ దీపిక

మరో రెండు రోజుల్లో ఒకటికానున్న సెలబ్రిటీ జంట విరాట్ కోహ్లీ, అనుష్కలను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో పాటు హీరోయిన్ దీపికా పదుకొనే ఇటలీకి బయలుదేరుతున్నారు. వీరిద్దరి పెళ్లికీ అతిథులుగా హాజరుకానున్న వీరు, సంగీత్ కార్యక్రమం నుంచే ఉంటారని, మూడు రోజులూ ఇటలీలో బస చేయనున్నారని తెలుస్తోంది.
వీరితో పాటు అనుష్క స్నేహితుల్లో ఒకరైన ఆదిత్య చోప్రా కూడా లండన్ వెళ్లనున్నాడు. ఇక అనుష్క తండ్రి అజయ్ కుమార్ శర్మ, తన ఇంటి చుట్టుపక్కల వారిని, బంధువులను పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రాలు కూడా పంచినట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here