జ‌గ‌న్ స‌ర్కార్ కూల‌బోతోందంటూ జోస్యం చెప్పారు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వై.ఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌కు ప్ర‌తిప‌క్ష టిడిపికి మాట‌ల యుద్ధం న‌డుస్తోంది. నిన్న విశాఖ‌లో ఆపార్టీ నేత స‌బ్బం హ‌రి ఇంటి వ‌ద్ద కూల్చివేత ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే.. మ‌రో టిడిపి నేత ప‌ట్టాభిరామ్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై టిడిపి తీవ్ర స్థాయిలో మండిప‌డుతోంది.

దీంతో అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తున్నందుకే ఇలా క‌క్ష్య క‌ట్టి దాడులు చేస్తున్నార‌ని టిడిపి మండిప‌డుతోంది. టిడిపి నేత వ‌ర్ల రామ‌య్య ప‌ట్టాభిరామ్‌ని ప‌రామ‌ర్శించారు. 24 గంట‌ల్లో కారును ధ్వంసం చేసిన వారిని ప్ర‌భుత్వం ప‌ట్టుకోవాల‌ని లేదంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. దీన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నామ‌న్నారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలపై మండిప‌డ్డారు. ధర్మాన లాగా తాము కూడా మాట్లాడగలం కానీ టీడీపీ మాకు సభ్యత నేర్పిందన్నారు.

జగన్ సర్కార్‌కు నూకలు చెల్లె కాలం దగ్గర పడిందని వర్ల జోస్యం చెప్పారు. కాగా నిన్న టిడిపి నేత‌ సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న టాయిలెట్ రూమ్‌ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. స‌బ్బం హ‌రి ప్ర‌భుత్వ స్థ‌లంలో నిర్మాణాలు చేప‌ట్టార‌ని అందుకే కూల్చిన‌ట్ల అధికారులు తెలిపారు. గ‌తంలో నోటీసులు ఇచ్చినా ప‌ట్టించుకోలేద‌ని తెలిపారు. దీనిపై కూడా వైసీపీ టీడీపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు మండిప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here