కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా, హోటళ్లు, పర్యాటక ప్రదేశాలు ఇలా అన్నీ మూత పడడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఎప్పుడు బిజీ బిజీగా గడిపే సెలెబ్రిటీలు సైతం షూటింగ్ లు లేకపోవడంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు. ఇక తాజాగా అన్ లాక్ ప్రక్రియ మొదలుకావడంతో ఇప్పుడిప్పుడే అంతా బయటకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా నటి తాప్సీ జైపూర్ వెళ్లింది. చాలా రోజుల తర్వాత విహార యాత్రకు వెళ్లిన తాప్సీ అక్కడ ప్రకృతి రమణీయత నడుమ దిగిన అందమైన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలతో పాటు.. ‘ఇప్పుడు మనందరికీ కావాల్సింది కాస్త ప్రశాంతత, చిరునవ్వు, శ్వాసించేంత గాలి’ అని రాసుకొచ్చింది. ఇక తాప్సీ నటిస్తోన్న సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు హిందీ చిత్రాలతో బిజీగా ఉంది.