ఇండస్ట్రీ లో మరొక క్రేజీ మల్టీ స్టారర్ తెర కేక బోతుంది.ఈ క్రమం లో ప్రముఖ కామెడీన్స్ సునీల్ ,అల్లరి నరేష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.ఈ ఇద్దరు స్టార్ కమెడియన్స్ తెలుగులో తిరుగులేని కామెడీ జోన్ హీరోలుగా పేరు సంపాదించుకున్నారు….ఈ క్రమంలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు వీరిద్దరి కోసం ఓ స్టొరీ సిద్ధం చేశారు…ఈ సినిమాను సంక్రాంతి రోజున షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు సినిమాకు సంబంధించి వారు చెబుతున్నారు.
గతంలో సునీల్,నరేష్ కలిసి సినిమాలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి వీరిద్దరికీ ఎటువంటి హవిజయాలు లేవు .వీరిద్దరూ ఎప్పుడు హిట్టు కొడతామా అని ఎదురుచూస్తున్నారు… దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు పరిస్థితి కూడా ఇంతే… ఈ పరిణామంలో ఈ ముగ్గురు కలిసి తీయబోతున్న సినిమా ఎటువంటి ఫలితాలను ఇస్తుంధో చూడాలి మరోవైపు ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని తెరకెక్కించిన సంస్థ… ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ కాంబోని పట్టాలెక్కిస్తోంది. త్వరలో పూర్తి వివరాలు తెలుస్తాయి.