కరోనా కల్లోలానికి ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. మరీ ముఖ్యంగా పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది దాతలు నిరుపేదలను ఆదుకుంటూ… ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు షకలక శంకర్ భిక్షాటన చేసి మరీ పేద కుటుంబాలకు డబ్బులు పంచాడు. ఇందుకోసం ఆయన కరీంనగర్ వీధుల్లో భిక్షాటన చేశాడు. భిక్షాటన ద్వారా సుమారు రూ. 90 వేలు సమకూరగా… పదివేల రూపాయలు సొంతంగా కలుపుకొని, మొత్తం లక్ష రూపాయలతో… కరీంనగర్లోని ఏడు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించాడు.
ఇలా నెలకొకసారి సేవ కార్యక్రమం చేయాలనుకుంటున్నానని, దానికి ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం ఉండాలని వేడుకుంటున్నానంటూ శంకర్ తెలిపాడు. ఇక ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి తనకు సహకరించిన అందరికీ శంకర్ కృతజ్ఞతలు తెలిపాడు. కొన్ని రోజుల క్రితం కూడా ఓ రైతు కూలీ కుటుంబానికి శంకర్ కాడెద్దులు-నాగలిని బహూకరించాడు.