రవితేజాతో మళ్లీ జతకట్టనున్న ‘రన్ రాజా రన్’ బ్యూటీ..

‘రన్ రాజా రన్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల నటి సీరత్. ఈ సినిమా తర్వాత టైగర్, కొలంబస్, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు, వంటి సినిమాల్లో తళుక్కుమందీ తార. అయితే ఈ అమ్మడు తెలుగులో ఆశించిన స్థాయిలో ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా మరో మంచి అవకాశాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రవితేజతో హీరోయిన్ గా నటించే అవకాశం సొంతం చేసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. గతంలో ఈ అమ్మడు రవితేజతో కలిసి నటించిన విషయం తెలిసిందే.

రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఇటీవల ఓ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఈ చిత్రంలో సీరత్ కపూర్ ని ఓ కథానాయికగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి కిలాడి అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్లు సమాచారం. రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న ‘క్రాక్’ సినిమా పూర్తయ్యాక ఈ కొత్త చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here