కొత్త మలుపు తీసుకున్న సుశాంత్ కేసు…

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో భాగంగానే డ్రగ్స్ కోణం బయటకొచ్చింది. డ్రగ్స్ కేసులో రియాను ఎన్‌సీబీ నాలుగు రోజుల పాటు విచారించింది. సుశాంత్‌ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే.. తాను మాత్రం డ్రగ్స్ వినియోగించలేదని, కేవలం సుశాంత్ కోసమే కొనుగోలు చేశానని రియా చెప్పుకొచ్చింది.

 

ఈ క్రమంలోనే రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది. డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్లు గుర్తించిన ఎన్‌సీబీ ఆమెను అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే విచారణలో భాగంగా రియా బాలీవుడ్ లో డ్రగ్స్ వాడే 25 మంది ప్రముఖుల పేర్లు వెల్లడించినట్టు సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here