తనదైన శైలి లో విమర్శలు చెయ్యడం లో జేసీ దివాకర్ రెడ్డి పెట్టింది పేరు. చంద్రబాబు మీద డిల్లీ లో కంప్లైంట్ చెయ్యడానికి వెళ్ళిన జగన్ మీద ఆయన సీరియస్ అవుతున్నారు. రెండు రోజులుగా తన స్టైల్ లో జేసీ ఎకి పారేస్తున్నారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న రాష్ట్రపతి ని టార్గెట్ చేస్తూ సీరియస్ వ్యాఖ్యలు చేసారు ఆయన. జగన్ ఫిర్యాదును తీసుకునే రాష్ట్రపతి పరిశీలిస్తామని చెప్పడం మినహా చేసేదేమీ లేదని కూడా ఆయన సంచలన ఆరోపణ చేశారు. అంతటితో ఆగని జేసీ… రాష్ట్రపతి భవన్కు వెళ్లే జగన్ బృందానికి కాసిన్ని టీ నీళ్లు దొరకడం మినహా మరేమీ లభించదని కూడా తేల్చేశారు.
అంటే రాష్ట్రపతి పదవి రబ్బర్ స్టాంపేనని ప్రచారంలో ఉన్న విషయాన్ని జేసీ బహిరంగం చేశారనే మాట వినిపిస్తోంది. డిల్లీ లో ఉన్న ప్రధాని ని కలవడం మినహా జగన్ చెయ్యగలిగింది ఏమీ లేదు అనీ అతన్ని అక్కడ ఎవ్వరూ పట్టించుకోను కూడా పట్టించుకోరు అని జేసీ ఎద్దేవా చేసారు