కేజీఎఫ్ డైరెక్ట‌ర్‌తో రాం చ‌ర‌ణ్ మూవీ..

కేజీఎఫ్ సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కేజీఎఫ్ త‌ర్వాత ఆ మూవీ టీం మొత్తం మంచి పేరు సంపాదించుకున్నారు. సినిమా ఏ భాష‌లో రిలీజైనా క‌చ్చితంగా సూప‌ర్‌హిట్ అనే టాక్ వినిపించింది అప్ప‌ట్లో. ఇప్పుడు మ‌రోసారి కేజీఎఫ్ డైరెక్ట‌ర్ వార్తల్లోకెక్కారు.

కేజీఎఫ్ త‌ర్వాత‌ ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌ అయిపోయాడు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. ఆ సినిమా విడుదల తర్వాత స్టార్‌ హీరోలందరి చూపు ఆయనపై పడింది. హీరోని ఎలివేట్‌ చేయడంలో ఆయన చూపించిన స్టైల్‌ అందరినీ ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కూడా ప్రశాంత్‌ నీల్‌ టచ్‌లోకి వెళ్లిపోయారు. ప్ర‌శాంత్ హీరో ప్ర‌భాస్‌తో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో తెలుగు హీరోతో కూడా ఆయ‌న సినిమా చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్‌ నీల్‌తో ఇప్పటికే టాలీవుడ్‌ మరో స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ టచ్‌లో ఉన్నాడట. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు, రామ్‌ చరణ్‌కు ఇటీవల ప్రశాంత్‌ నీల్‌ ఓ స్టోరీలైన్‌ వినిపించడం, వారు ఇంప్రెస్‌ అవ్వడంతో త్వరలోనే చరణ్‌- ప్రశాంత్‌ నీల్‌ చిత్ర ప్రకటన కూడా రానుందని అంటున్నారు. అంతే కాదు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందించేందుకు రెండు ప్రముఖ సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయట. మ‌రి ఈ విష‌యంలో అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here