భారతీయ వెండితెర మీద బాహుబలి సినిమాను అద్భుతంగా చెక్కిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి రావడం జరిగింది… ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సీఆర్డీఏ సమావేశం సచివాలయంలో జరిగింది ఈ సమావేశంలో మంత్రి నారాయణ ప్రభుత్వ అధికారులు నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు రాజమౌళి కూడా పాల్గొన్నారు.
అమరావతి రాజధాని లో నిర్మించబోయే కట్టడాలైన అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించి డిజైన్లను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు భవన నమూనాలను నార్మన్ ఫోస్టర్ సంస్థ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డిజైన్లకు సంబంధించి రాజమౌళి సూచనలు అందించారు. ఆ మధ్యన డిజైన్ లు చూడడం కొసం విదేశాలు కూడా వెళ్ళిన మౌళి ఆక్కడ ఫైనల్ చేసుకున్న వి అన్నీ ఇప్పుడు ఇక్కడ క్లియర్ చేస్తున్నారు.