పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా అజ్ఞాతవాసి సంక్రాంతి సందర్భంగా విడుదలైందని మనకందరికీ తెలుసు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా సినిమాకు బాగానే డబ్బులు వచ్చినయి అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తర్వాత చేయబోయే సినిమా ఏంటి అని హాట్ టాపిక్ గా మారింది ఇండస్ట్రీలో తన తర్వాత సినిమా ఏఎం రత్నం తో ఉండబోతుందని ఈ సినిమాకు ‘చరిత్ర’ అనే టైటిల్ ఖరారు చేశారు అని సమాచారం.
ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ఎవరు అనేది, ఇంకా అనేక విషయాలు త్వరలో అధికారికంగా చెబుతారట.అంతేకాకుండా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోను పవన్ ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటినుండి చేయబోయే సినిమాలకు భారీగా పారితోషికం తీసుకుంటున్నారట దీంతో ఇండస్ట్రీలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది .