ఎవరు ఎవరికి చెక్‌ పెడుతున్నారు.?

నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. చదరంగం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘చెక్‌’ అనే ఆసక్తికర టైటిల్‌ను చిత్రయూనిట్‌ ఫైనల్‌ చేసింది.

టైటిల్‌తో పాటు ప్రిలుక్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. ఇక ఈ సినిమా గురించి నిర్మాత ఆనంద ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నితిన్‌ విశ్వరూపం చూస్తారు. సినిమాలో ఎవరు ఎవరికి చెక్‌ పెడతారన్నది సస్పెన్స్‌’ అని చెప్పుకొచ్చారు. ఇక చిత్ర దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి సినిమా కథ గురించి వివరిస్తూ.. ‘ఈ సినిమాలో నితిన్‌ ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో కనిపించనున్నారు. చదరంగం నేపథ్యంలో చిత్రకథ ఉంటుంది. సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది’అని తెలిపారు. ఇక ఈ సినిమా చివరి షెడ్యుల్‌ ఈనెల 12న ప్రారంభం కానుంది. మరి విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో నితిన్‌ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here