‘అంధాధున్’ రీమేక్ లో నటించనున్న శ్రియ..

నితిన్ హీరోగా బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న ‘అంధాధున్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టే, టబు ప్రధాన పాత్రలో కనిపించారు. ఇక తెలుగు రీమేక్ లో నితిన్ కు జంటగా.. నభా నటేష్ ఎంపికైంది. ఇక బాలీవుడ్ లో టబు పోషించిన పాత్రను  తెలుగులో శ్రియ పోషించనున్నట్లుతెలుస్తోంది. ఈ పాత్ర సినిమాకు ఎంతో కీలకం.

నిజానికి ఈ పాత్రలో శ్రియ కంటే ముందు..  నయనతార, శిల్పా శెట్టి, ఇలియానా తదితరుల పేర్లను పరిశీలించారు. అయితే చివరికి శ్రియను ఎంపిక చేసినట్లు సమాచారం. నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ చిత్రంలో నటిస్తున్నాడు…  ఈ సినిమా రీమేక్ పూర్తికాగానే ‘అంధాధున్’ రీమేక్ మొదలుపెట్టనున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here