కృతి.. కవిహృదయం పలికింది.!

‘1 నేను ఒక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్. తన అందం, నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసిందీ బ్యూటీ. అనంతరం నాగచైతన్య హీరోగా నటించిన దోచేయ్‌ చిత్రంలో మరోసారి తళుక్కుమందీ తార. ఇక ఆ తర్వాత బాలీవుడ్ పైనే దృష్టి సారించిన ఈ చిన్నది.. ఎక్కువగా అక్కడే సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ‘పానిపట్’, ‘ హౌస్ ఫుల్ 4’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

ఇదిలా ఉంటే తనలో కేవలం యాక్టింగ్ టాలెంటే కాకుండా.. రైటింగ్ టాలెంట్ కూడా ఉందని చెబుతోందీ చిన్నది. చెప్పడమే కాదు.. తనలోని కవి హృదయాన్ని సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. ఇటీవల ట్విట్టర్ వేదికగా కృతీ సనన్ పోస్ట్ చేసిన ఒక కవిత ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ పడిపోయిన ప్రతిసారీ ఆమె బలం పుంజుకుంది. అదే నేను. మచ్చలు ఆమెను అందంగా చేశాయి. తిన్న ఎదురుదెబ్బలు మరింత రాటుదేలేలా చేశాయి. ఆమెను కాల్చలేము, ముక్కలు చేయలేము.. ఎందుకంటే ఆమె ఒక జ్వాల.  ఒక పెను తుపాను’ అంటూ రాసుకొచ్చిందీ బ్యూటీ. ‘ నా ఆలోచనలను కవితలుగా రాయడం నాకు ఇష్టం.. కొన్నిసార్లు అందులో విషయం ఉండకపోవచ్చు. మీరేమీ అర్థం చేసుకుంటారన్నది మీపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొంది కృతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here