ఎయిడ్స్‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం.. అప్ర‌మ‌త్తంగా ఉండాలంటున్న యూనిసెఫ్‌..

ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ ఓ వైపు వ‌ణికిస్తుంటో ఎయిడ్స్‌కు సంబంధించిన వార్త‌లు ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ఒక‌ప్పుడు ఎయిడ్స్ ఎంత‌లా భ‌య‌పెట్టిందో అంద‌ర‌కి తెలిసిందే. అయితే ఇటీవ‌ల కాలంలో ఎయిడ్స్‌ను చాలా మంది మ‌ర్చిపోయారు. తాజాగా యూనిసెఫ్ ఎయిడ్స్‌కు సంబంధించిన కీల‌క విష‌యాలు వెల్ల‌డించింది.

ప్రతీ 100 సెకండ్లకు 20 ఏళ్ల లోపు పిల్లవాడు లేదా యువకుడు హెచ్ఐవీ బారిన పడ్డారని యునిసెఫ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. గత ఏడాది 2.8 మిలియన్ల మంది పిల్లలు హెచ్ఐవీ బారిన పడ్డారని యునిసెఫ్ విడుదల చేసిన తన నివేదికలో వివరించింది. పిల్లలు, యువత, గర్భిణీ స్త్రీలు హెచ్ఐవీ వ్యతిరేక పోరాటంలో వెనుకబడి ఉన్నారని యునిసెఫ్ నివేదికలో హెచ్చరించింది. గత సంవత్సరం దాదాపు 1,10,000 మంది పిల్లలు హెచ్ఐవీతో మరణించారని నివేదికలో యునిసెఫ్ తెలిపింది. యువకులతో పోలిస్తే పిల్లలు ఎయిడ్సు వల్ల ఎక్కువ మంది మరణించారని తేలింది. తమ బిడ్డలకు హెచ్ఐవీ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తల్లులకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ పెంచాలని నిర్ణయించారు. హెచ్ఐవీతో బాధపడుతున్న 1.3 మిలియన్ల మంది గర్భిణులకు పుట్టిన పిల్లలకు, తల్లి పాలు ఇవ్వడంతో హెచ్ఐవీ సోకిందని అంచనా వేశారు.

హెచ్ఐవీ, ఎయిడ్సు కు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్న పిల్లల్లో యాంటీ రెట్రోవైరల్ చికిత్స కవరేజ్ తక్కువగా ఉందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు హెచ్ఐవీ మహమ్మారి బారిని పడుతున్నారని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ చెప్పారు. గత సంవత్సరం 0 నుంచి 9 సంవత్సరాల వయసు గల 1,50,000 మంది పిల్లలు కొత్తగా హెచ్ఐవీ బారిన పడ్డారు. 10 నుంచి 19 సంవత్సరాల వయసుగల 1,70,000 మందికి కౌమార దశలో హెచ్ఐవీ సోకింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here