సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో పరిణామాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. నెపోటిజంతో మొదలైన చర్చ ఇప్పుడు డ్రగ్స్ అనే కొత్త కోణం తీసుకుంది. ఇక ఈ వ్యవహారానికి రాజకీయ రంగు కూడా పులుముకున్న విషయం తెలిసిందే. నటి కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు.. దానికి ముంబై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ఇలా ఓ చిన్నసైజు యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలోనే కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంతో వాగ్వివాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కంగనాకు పలువురి నుంచి మద్దతు కూడా లభిస్తోంది. తాజాగా తమిళ హీరో విశాల్… కంగనాను ఏకంగా భగత్ సింగ్ తో పోల్చాడు.
Dear @KanganaTeam pic.twitter.com/73BY631Kkx
— Vishal (@VishalKOfficial) September 10, 2020
ట్విట్టర్ వేదికగా కంగనాకు మద్దతు తెలుపుతూ…
‘డియర్ కంగనా.. నీ ధైర్య సాహసాలకి హ్యాట్సాఫ్. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మీరు రెండుసార్లు ఆలోచించలేదు. మీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని మీరు ఎదుర్కొంటున్నారు. 1920లో భగత్ సింగ్ ఎలా అయితే నిలబడ్డాడో అలా ధైర్యంగా మీరూ నిలబడ్డారు. ప్రభుత్వాలు తప్పు చేస్తే.. ప్రజలు ధైర్యంగా ఎలా నిలబడవచ్చో చూపించారు. సెలబ్రిటీలే కాదు సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. వాక్ స్వాతంత్రపు హక్కు (ఆర్టికల్ 19) గుర్తు చేశారు. మీకు అభినందనలు’ అంటూ సుదీర్ఘమైన పోస్టు చేశాడు విశాల్. మరి కంగనా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం అన్నట్లు సాగుతున్న ఈ పరిస్థితిలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.