టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా..

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేస్తున్న ట్వీట్లు, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత ముంబాయి ప్రభుత్వం, బాలీవుడ్ ఇండస్ట్రీ పై కంగనా పలు వ్యాఖ్యలు చేస్తూ టాక్ అఫ్ ది టౌన్ గా నిలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ పై కంగనా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశంలో మొదటి స్థానంలో ఉందని ట్వీట్ చేసింది. ఈ విషయమై కంగనా ట్వీట్ చేస్తూ… ‘భారతదేశంలో బాలీవుడ్ అతిపెద్ద చిత్ర పరిశ్రమ అని ప్రజలకు తప్పుడు అవగాహన ఉంది. కానీ.. తెలుగు చిత్ర పరిశ్రమ శాసిస్తోంది. బాలీవుడ్ చిత్రాలు చాలా వరకు షూటింగ్‌లు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ స్థిరంగా పాన్ ఇండియన్ ప్రాజెక్టులను రూపొందిస్తోంది. భారతదేశంలో అగ్రశ్రేణి చిత్ర పరిశ్రమ.. హిందీ చిత్ర పరిశ్రమ అని ప్రజల అభిప్రాయం తప్పు.

తెలుగు చిత్ర పరిశ్రమ తనను తాను అగ్రస్థానంలో నిలుపుకుంది. బహు భాష సినిమాలు చేయడంతో పాటు పాన్ ఇండియా సినిమాలు చేయడంలో తెలుగు సినిమా ముందుంది’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ముంబై ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడాలోని అతిపెద్ద ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారన్న వార్తలపై కంగనా ఈ వ్యాఖ్యలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here