స్పెషల్ స్టేటస్ మిద టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలనకరమైన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద తెలుగదేశం పార్టీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, కేవలం ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే వస్తుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  భవిష్యత్తు కోసం వైయస్సార్సీ పార్టీ ఎంపీలు ఉభయ సభలలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఉద్యమం చేశారు….ఇటివల జరిగిన బడ్జెట్ సమావేశాలలో. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి.
తాజాగా వైసీపీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఏంపీలతో రాజీనామాలు చేయిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఏపీ ప్రజల్లో మరింత బలం వచ్చింది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేటట్లు వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కేంద్రానికి అమ్ముడుపోయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here