తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోయి చాలాకాలమైనా.. ఇంకా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆమె పోయిన తర్వాత.. పార్టీపై పట్టుకోసం.. అధికారాన్ని దక్కించుకోవడం కోసం.. శశికళ, పనీర్ సెల్వం వర్గాల మధ్య.. ఇప్పటికీ నడుస్తున్న గొడవను.. జయలలితకు ముడిపెట్టి.. కొందరు కొత్త ప్రచారం చేస్తున్నారు. జయలలిత ఇంకా పూర్తిగా చనిపోలేదని.. ఆమె ఆత్మగా తిరుగుతోందని.. తన ప్రాణానికి ప్రాణంగా భావించే వేదనిలయంలోనే.. పురచ్చితలైవి ఆత్మ తిరుగుతోందని.. కొందరంటున్నారు.
ఈ ప్రచారానికి సంబంధించి.. ఓ ఫొటో కూడా సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. పనీర్ సెల్వం, శశికళ వర్గాల మధ్య గొడవల కారణంగానే.. జయలలిత ఆత్మగా మారిందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే.. జయ ఆస్తులపై కన్నేసిన మన్నార్ గుడి మాఫియా (శశికళ కుటుంబం) నే.. ఇలా ప్రచారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు తమిళనాడు వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
ఇందులో నిజమెంతో.. అబద్ధమెంతో.. పై లోకంలో ఉన్న జయలలితకే ఎరుక!