బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న రంగస్థలం

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా విడుదలయి బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్లతో దూసుకెళ్లి పోతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఓవర్సీస్ లో రికార్డుల మోత మోగిస్తుంది. ఇప్పటికే 175 కోట్ల గ్రాస్ తో దుమ్ము రేపుతున్న ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో 200 కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది.

బాహుబలి సినిమా తరువాత ఆ రేంజ్ లో వసూళ్లు అందుకున్న చిత్రంగా క్రేజ్ తెచ్చుకుంది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో పల్లెటూరి వాతావరణం సెట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ కూడా థియేటర్లలో రంగస్థలం హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది. రంగస్థలం ప్రస్తుత కలెక్షన్లు బట్టి ఓవర్ అల్ కలెక్షన్లు చూసుకుంటే విచిత్రం చాలా రికార్డులు సృష్టిస్తుంది అని అంటున్నారు ట్రేడ్ వర్గ  నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here