మరణించిన హాస్యనటుడు గుండు హనుమంతరావు!

హాస్యనటుడు గుండు హనుమంతురావు సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తీవ్ర అనారోగ్యా నేపథ్యంలో హాస్పిటల్ లో జాయిన్ అయి తీవ్ర అస్వస్థతకు గురై మరణించడం జరిగింది. గతంలో భార్య కూతురు మరణంతో తీవ్ర మనో వేదనకు గురయ్యారు గుండు హనుమంతరావు. 18 సంవత్సరాల వయసులోనే  సినిమా రంగంలో అడుగుపెట్టారు గుండు హనుమంతరావు.

తెలుగు లో చాల హిట్ సినిమాలలో నటించిన గుండు హనుమంతరావు అమృతం సీరియల్ ద్వారా మంచి పాపులర్ నటుడిగా తెలుగు ప్రేక్షకులలో  గుర్తింపు పొందాడు.గుండు హనుమంతరావు మరణంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. తెలుగు ఇండస్ట్రీలో గుండు హనుమంతరావు కి మనసున్న మనిషిగా మంచి పేరు వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here