దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావిరవీంద్రనాథ్ చౌదరి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నిన్న రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రావిరవీంద్రనాథ్ అత్యంత సన్నిహితుడు. అప్పట్లో వైఎస్తో కలిసి ఈయన కూడా డాక్టర్ చదువుకున్నారు. వైఎస్ రాజకీయాలలోకి వచ్చిన అనంతరం రావిరవీంద్రనాథ్ కూడా రాజకీయాలలోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రావిరవీంద్రనాథ్ తెనాలి ఎమ్మెల్యేగా, రెండు సార్లు తెనాలి మున్సిపల్ ఛైర్మన్గా పనిచేశారు.
RIP