భార్యను హ‌త్య చేసి.. త‌ల‌ను ఏం చేశాడో తెలుసా..

భార్య‌కు మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం ఉంద‌న్న అనుమానంతో ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను చంపేశాడు. త‌ల‌ను న‌రికి ఆ త‌ల‌ను త‌న భార్య అక్ర‌మ సంబంధం పెట్టుకుంద‌ని భావించిన వ్య‌క్తి ఇంటి ముందు పెట్టాడు. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాలోని నారాయ‌ణ‌ఖేడ్ ప్రాంతానికి చెందిన సాయిలు అనే వ్య‌క్తి వ‌య‌స్సు 50 ఏళ్లు. అయితే త‌న భార్య‌కు మ‌రొక‌రితో సంబంధం ఉంద‌ని అనుమానం క‌లిగింది. అయిన‌ప్ప‌టికీ దీన్ని ప‌ట్టించుకోలేద‌ని తెలిసింది. అయితే ఇటీవ‌లె దీని గురించి ఆలోచిస్తూ చివ‌ర‌కు త‌న భార్య‌ను చంపేయాల‌ని అనుకున్నాడు. దీంతో బుధ‌వారం రోజు రాత్రి గొడ్డ‌లితో భార్య త‌ల‌ను న‌రికేశాడు. ఆ త‌ర్వాత ఆ త‌ల‌ను ఐదు కిలోమీట‌ర్ల దూరం బైక్‌పై తీసుకెళ్లి అనుమానిస్తున్న వ్య‌క్తి ఇంటి ముందు పాడేశాడు.

విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. సాయిలును అరెస్టు చేశారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌ని అడ‌గ‌గా విష‌యం బ‌య‌ట పెట్టాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. విష‌యం తెలుసుకున్న బంధువులు, స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే గ‌తంలో కూడా ప‌లుమార్లు గొడ‌వ ప‌డ్డార‌ని అయిన‌ప్ప‌టికి ఎప్పుడూ ఇంత వివాదం జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ కేసులో పోలీసులు ఇంకేమైనా విష‌యాలు బ‌య‌ట‌కు తీస్తారా అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here