దిల్ రాజు – ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో అప్పట్లో బృందావనం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఓ ఫ్యామిలీ స్టోరీతో ఎన్టీఆర్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో దిల్ రాజు ఉన్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ స్టోరీ బృందావనం మంచి విజయాన్ని అందుకుంది.ఇప్పుడు ఎన్టీఆర్ తో మరో మంచి ప్యామిలీ స్టోరీ చేసేందుకు శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగ్నేశ చేత దిల్ రాజు కథ చెప్పించాడట. ఆ కథ ఫ్యామిలీ స్టోరీ కావడంతో ఎన్టీఆర్ ను బాగా ఆకట్టుకుందట. ఎన్టీఆర్ కోరిక మేరకు స్వల్ప మార్పులు చేసేందుకు దర్శకుడు సిద్ధమౌతున్నాడట. ఇదే గనుక పూర్తైతే, వెంటనే ఈ కాంబినేషన్ లో సినిమా మొదలు కావడం ఖాయం.